గర్వం…(కథ)

 

                                                                             గర్వం                                                                                                                                                          (కథ)

కుటుంబానికి పెద్దది కూతురు రోహిణి. పెళ్ళి చేసుకుని భర్త ఇంటికి వెళ్ళిన ఆమె...ఒక సంవత్సరం తరువాత, చేతిలో బిడ్డతో, కళ్ళ నిండా నీరుతో పుట్టింటో వదిలి పెట్టబడింది.

రోహిణి పరిస్థితి చూసి కన్న తల్లి సావిత్రి ఆవేదన చెందింది. ‘కూతురు పెళ్ళిచేసుకుని ఒకే సంవత్సరంలో భర్తను కోల్పోయి విధవరాలుగా ఇంటి లోపలకు వచ్చిందే...!’ అనే షాక్ తోనే తండ్రి చనిపోయారు. కారుణ్య నియామకం క్రింద తండ్రి ఉద్యోగం ఇంట్లో ఒకళ్ళకి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఆధారమూ లేకుండా వచ్చి నిలబడ్డ కూతురు తండ్రి వలన వచ్చిన ఉద్యోగంలో జేరితే ఆమె జీవితం సాఫీగా గడిచిపోతుందని ఆశపడింది తల్లి. కానీ, కూతురు ఉద్యోగాన్ని తన కన్న ఎక్కువ చదువుకున్న తమ్ముడికి త్యాగం చేసింది. తల్లి బాధ పడ్డది. తమ్ముడు తనకూ, తన బిడ్డకూ హామీగా ఉంటాడని ఆమె నమ్మింది. తల్లి భయపడ్డది...తాను అనుకున్నది జరిగిందని రోహిణి గర్వపడింది.

రోహిణి గర్వపడటం ఆమెకు న్యాయం చేసిందా? తల్లి భయం గెలిచిందా లేక ఓడిపోయిందా? అక్కయ్య తీసుకోవలసిన ఉద్యోగం తాను తీసుకున్న ఆమె తమ్ముడు ఆమెను నిజంగానే గర్వపడేటట్టు చేసాడా?....తెలుసుకోవటానికి కథ చదవండి.

**************************************************************************************************** 

కుటుంబానికి పెద్దది కూతురు రోహిణి. పెళ్ళి చేసుకుని భర్త ఇంటికి వెళ్ళిన ఆమె...ఒక సంవత్సరం తరువాత, చేతిలో బిడ్డతో, కళ్ళ నిండా నీరుతో పుట్టింటో వదిలి పెట్టబడింది. తీసుకు వచ్చి దింపింది ఎవరో కాదు... స్వయానా ఆమె అత్తగారు రామలక్ష్మే!

రోహిణి పరిస్థితి చూసి సావిత్రి ఆవేదన చెందింది. కన్న తల్లి ఇంకేం చేయగలదు?

తండ్రి, తాలూకా ఆఫీసులో గుమాస్తా. కూతురు పెళ్ళిచేసుకుని ఒకే సంవత్సరంలో భర్తను కోల్పోయి విధవరాలుగా ఇంటి లోపలకు వచ్చిందే...!అనే షాక్ తోనే చనిపోయారు. కారుణ్య నియామకం క్రింద తండ్రి ఉద్యోగం ఇంట్లో ఒకళ్ళకి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

తల్లి సంతోషపడి రోహిణి దగ్గరకు వచ్చింది. రోహిణీ నాన్న ఉద్యోగం మనింట్లో ఎవరికో ఒకరికి ఇస్తారట. నువ్వు చేరిపో. ఆధారమూ లేకుండా ఉన్న నీకు ప్రభుత్వ ఉద్యొగం జీవితాంతం ఆధారంగా ఉంటుంది. నీ కొడుకును కూడా బాగా చదివించి గొప్పవాడ్ని చెయొచ్చు

వద్దమ్మ...నాకు ఉద్యోగం ఇచ్చినా నా చదువుకు తగ్గ ఉద్యోగమే ఇస్తారు. జీతమేమీ గొప్పగా రాదు. అందుకుని ఉద్యోగాన్ని తమ్ముడు తీసుకోనీ. బాగా చదువుకున్నాడు. ఉద్యోగాల వేటలో ఉన్నాడు. వాడు ఉద్యోగం చేస్తే, మంచి జీతం వస్తుంది. డిపార్ట్ మెంట్ పరీక్షలు రాసి ప్రమోషన్లు తెచ్చుకోవచ్చు. రకంగా ఆలొచించినా ఉద్యోగం వాడికి ఇవ్వడమే కరక్ట్ అన్నది రోహిణి.

ఏమే నేనేమో నీ జీవిత భీమా కోసం చెబితే, నువ్వేమిటి నాకొద్దు తమ్ముడు చేయనీ అంటున్నావు

ఏమ్మా తమ్ముడు మీద నీకు నమ్మకం లేదా. మనల్ని చివరిదాకా చూసుకోడా. నా కొడుకును చదివించడా?”

రోహిణీ వాడు నా కొడుకే. నేను చెప్పింది నువ్వు అర్ధం చేసుకోలేదు. రేపు వాడికి పెళ్లై, భార్య వస్తే...ఏం జరుగుతుందో. వాడు మగాడే ఎలాగైనా తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు, నన్ను కూడా చూసుకుంటాడు..నీ పరిస్తితి?”

తమ్ముడి మీద నాకు నమ్మకం ఉందమ్మా...ఇక మాట వదిలేయ్   

కూతురు కంటే, కొడుకు ఎక్కువ చదువుకోవడం వలన ఇంట్లో అందరూ కలిసి తండ్రి ఉద్యోగాన్ని కొడుకు సురేష్ తీసుకోవటానికి ఒప్పుకున్నారు. తండ్రి ఉద్యోగం కొడుకు సురేష్ కు దొరికింది.

పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయ్యింది సావిత్రికి.

రోహిణికి ఏదైనా చెయ్యాలే?’ అని ఆలొచించింది. ఒక కొత్త కుట్టు మిషన్ తీసుకు వచ్చి ఇచ్చి ఇదిగోమ్మా...దీన్ని పెట్టుకుని నీ జీవితం గడుపమ్మా...

తన ఇంటికి పక్కనే ఉన్న కుట్టు మిషన్ నేర్పించే టీచర్ దగ్గర ట్రైనింగ్ అయ్యింది రోహిణి. ఇప్పుడు రోజుకు రెండు వందల రూపాయలు సంపాదిస్తోంది. డబ్బును ఇంట్లో ఇచ్చినప్పుడు, తమ్ముడు సురేష్ డబ్బును తననే ఉంచుకోమని చెప్పాడు. మాటకు తల్లి సంతోషించింది. డబ్బును తన కొడుకు పేరుతో బ్యాంకులో వేస్తూ వస్తోంది రోహిణి.

ఇప్పుడు వాడు కొంచంగా పెరిగాడు. పక్కనున్న మునిసిపల్ స్కూల్లో చేర్పించింది.

రోహిణికి సమస్యా లేదు. కొడుకు బాగా చదువుతున్నాడు అని తెలుసుకుని  సంతోషపడింది.

జీవిత చక్రం తిరిగింది.

రవి, ఇంటర్ ఫైనల్ ముగించాడు.

ఇంతవరకు పరవాలేదు ఎలాగో చదివించ గలిగాము. ఇప్పుడు మనవుడ్ని కాలేజీలో చేర్పించాలే. దానికి బాగా ఖర్చు అవుతుందే?” అని సావిత్రి తపించింది.

తపిస్తున్న తల్లి దగ్గరకు వచ్చిన రోహిణి చెప్పింది. అమ్మా...బాధపడకమ్మా! ఇంతవరకు నేను లక్ష రూపాయలు చేర్చాను...

అప్పుడు అక్కడికి వచ్చిన రోహిణి తమ్ముడు సురేష్ అక్కా...నువ్విప్పుడు రవిని ఇంజనీరింగ్లొ చేర్చేయి. వచ్చే సంవత్సరం నుండి నేను వాడికి ఫీజు కడతాను. ఎలాగైనా వాడ్ని ఇంజనీర్ను చేసే తీరాలి..

మంచి మార్కులు తెచ్చుకున్నందువలన రవికి ఇంజనీరింగ్ కాలేజీలో గవర్నమెంట్ సీటు దొరికింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కడితే చాలని చెప్పారు. అందువలన అంతా కొన్ని వేలల్లోనే ముగిసింది.

ఒక విధంగా రవి బి. పాసయ్యాడు. అందులో అదృష్టం ఏమిటంటే, కాలేజీ క్యాంపస్ ఇంటర్ వ్యూలో, హైదరాబాదుకు చెందిన ప్రముఖ కంపనీలో సెలెక్ట్ అయ్యాడు. అప్పాయింట్మెంట్ ఆర్డర్ను అమ్మ దగ్గర, మామయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర చూపించి ఆశీర్వాదాలు పొందాడు.

తల్లి అడిగింది: రోజే హైదరాబాద్ బయలుదేరాలా నాన్నా...?”

అవునమ్మా...రేపు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి...

రేయ్...అక్కడికి వెళ్ళిన తరువాత మమ్మల్నందరినీ మర్చిపోకురా... అన్నది అమ్మమ్మ సావిత్రి.

అమ్మమ్మా నేను ఉద్యోగానికి వెళ్ళటానికి కారణమే మీ అందరేనమ్మా. అలాంటి మిమ్మల్ని మర్చిపోతానా. మీ అందరినీ బాగా చూసుకుంటానమ్ముమ్మా. నెల నెలా నా ఖర్చులకు పోను, మిగిలిన జీతం డబ్బును మీకు పంపిస్తాను. బాగా సంపాదిస్తాను. అమ్మకు బంగారు గొలుసు కొనిబెడతాను

వాడి మాటలు విని అందరూ సంతోష పడ్డారు.

రవి ఉద్యోగంలో చేరాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు. ఒక్కొక్కర్నీ వదలకుండా మాట్లాడాడు. తన ఉద్యోగం గురించి వివరంగా చెప్పాడు.

నెల జీతం నలభై ఐదు వేలు. పదిహేను వేలు తనకోసం ఉంచుకుని, మిగిలిన డబ్బును ఇంటికి పంపించాడు.

ఇంట్లో అందరికీ చెప్పలేని ఆనందం, గర్వం.

వార్త తెలుసిన వెంటనే రోహిణి యొక్క అత్తగారూ-మామగారూ ఇద్దరూ పండ్లూ, స్వీట్లూ అన్నీ కొనుక్కుని కారులో వచ్చి దిగారు. ఇంతకీ వాళ్ల ఇల్లు పెద్ద దూరాన ఏమీ లేదు.

లోపలకు వచ్చిన వెంటనే రోహిణి అత్తగారు రామలక్ష్మి ఎక్కడ నా కోడలు రోహిణి. రోహిణీ... రోహిణీ.. అంటూ పిలుస్తూ భర్త మాణిక్యంతో పాటూ అక్కడున్న సోఫాలో కూర్చున్నారు.

కేకలు విని రోహిణి హాలులోకి వచ్చింది.

మరుక్షణం రామలక్ష్మి లేచి తొమలపాకుతో నల్లబడిన పళ్ళు కనబడేటట్టు రావే రోహిణీ...! నా కోడలా. నువ్వు ఎలా ఉన్నావమ్మా? బిడ్డ...అదే నా మనవడు ఎక్కడమ్మా...?”  అని అడిగింది.

వాడిప్పుడు చేతి బిడ్డ కాదు. ఇరవై ఏళ్ళ యువకుడు. బి.. డిగ్రీ చదువుకున్నాడు. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నలబై ఐదు వేల జీతంతో...

అయ్యో...అయ్యో...వాడ్ని మేమిప్పుడు చూడలేమా? పోనీ లేమ్మా... రోహిణీ వాడు అదృష్టవంతుడు. జీవితంలో బాగా పైకొస్తాడని నాకు అప్పుడే తెలుసు. ఎమ్మా రోహిణీ...నాకు చాలా దగ్గర బంధువు సదాసివం కూతురు సరోజ ఉన్నది చూడు....ఇప్పుడు దానికి ఇరవై ఏళ్ళు. బి.ఎస్.సి  చదువుకున్నది. మంచి ఉద్యోగానికి ప్రయత్నిస్తోంది.

మనవుడికి అమ్మాయినిచ్చి పెళ్ళి చేద్దామనే ఆలొచనతో మేము బయలుదేరి వచ్చాము. ఏమంటావు... అని చెప్పి తన చేతిలోని ఉన్న కవర్లను రోహిణి దగ్గర ఇచ్చింది రామలక్ష్మి.

ఇంతలో సురేష్ ఇంట్లోకి వచ్చాడు. అక్కడ కూర్చోనున్న అక్క మామగారినీ-అత్తగారినీ రోహిణి పెళ్ళి టైములో చూశాడు. తరువాత ఇప్పుడే చూస్తున్నాడు.

రండి...రండి...ఆశ్చర్యంగా ఉంది! ఇంత కాలం తరువాత మీరు వస్తారని నేను అనుకోలేదు. అంతెందుకు...మిమ్మల్నందరినీ దగ్గర దగ్గర మేము మరిచే పోయాము అన్నాడు.

సురేష్ మాటలకు అవాక్కైన వాళ్ళిద్దరూ హీ...హీ...ఏమిటి తమ్ముడూ...ఎన్ని సంవత్సరాలైతే ఏముంది? రోహిణి మా ఇంటి కోడలు కాదా! నా బాడ్ టైము...ఒక్కసారి కూడా వచ్చి చూడ లేదుదాని కొసం ఆమె మా ఇంటి కోడలు కాకుండా పోతుందా?” అన్నాడు రోహిణి మామగారు. 

ఎందుకీ అనవసరమైన మాటలు. మీరు ఏం కారణం కోసం ఇక్కడికి వచ్చారు?”

అంతా మంచి విషయం కోసమేరవీ...అదే మా మనవుడి పెళ్ళి గురించి మాట్లాడదామని...

మా అక్కయ్య కొడుకు ఇప్పుడే మంచి ఉద్యోగానికి వెల్తున్నాడు. వాడికి తొందరపడి పెళ్ళి చేసే ఉద్దేశ్యమే లేదు...

పరవాలేదు తమ్ముడూ. ఎన్ని సంవత్సరాలైనా కాచుకోనుంటాము. బంధుత్వం విడిపోకూడదు. బాగా ఆలొచించండి

ఇందులో ఆలొచించాల్సింది ఏమీ లేదు. మా అక్కయ్యను, అదే మీ కోడలు రోహిణిని మీరు ఒక్కసారైనా వచ్చి చూసి వెళ్ళుంటే...మా మనసులు చల్లబడి ఉండేవి. ఆమె ప్రాణాలతో ఉందా...లేదా అనేది కూడా మీరు ఆలొచించలేదు. ఇప్పుడు...రవి సంపాదిస్తున్నాడని తెలిసిన వెంటనే, మీ బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేసి, వాడిని మీ ఇంటి అల్లుడుగా చేసుకోవటానికి ఆదుర్దా పడుతున్నారు. దాని కోసం పరిగెత్తుకు వచ్చారు.

నేను ఖచ్చితంగా చెబుతున్నాను. మీ సంబంధమే వద్దు. పోయిన బంధుత్వం పోయినట్టే ఉండనివ్వండి! అనవసరంగా కలలు కంటూ ఇక్కడికి రాకండి. బయలుదేరండి... అంటూ ఆవేశంగా మాట్లాడి అవతలకి వెళ్ళిపోయాడు సురేష్.

పూర్తి నిశ్శబ్ధం. ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

రామలక్ష్మి, మాణిక్యమూ మౌనంగా లేచి బయటకు వెళ్ళిపోయారు.

తలవంచుకోనున్న రోహిణి తల ఎత్తుకుంది గర్వంగా

****************************************************సమాప్తం*****************************************


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

దుబాయి వాడి పెళ్ళాం…(కథ)

చిలుకల గుంపు...(కథ)

ఆకలికి రంగులేదు…(కథ)